Monday, December 24, 2012

అరటిపళ్లు పసుపుపచ్చగా ఎలా మారతాయి?

క్లోరోఫిల్ కారణంగా అనేక చెట్ల ఆకులు ఆకుపచ్చగా ఉన్నట్టుగానే అరటిపళ్ళు కాయల రూపంలో ఉన్నపుడు వాటి తొక్క ఆకుపచ్చగానే ఉంటుంది. ఇవి పండినపుడు వాటిలోని క్లోరోఫిల్ విచ్ఛిన్నమై పసుపురంగు కనపడటం మొదలవుతుంది. ఈ మార్పు సమయంలో అప్పటివరకూ ఉన్న పిండిపదార్థాలు చక్కెరగా మారతాయి.  పెక్టిన్ అనబడే పిండిపదార్థం విచ్ఛిన్నమై, పండు తాలూకు గుజ్జు మెత్తబడుతుంది. శిశిరరుతువులో చెట్ల ఆకులు పసుపురంగులోకి మారడానికి కూడా ఆయా ఆకుల్లోని క్లోరోఫిల్ విచ్ఛిన్నం కావడమే ప్రధానకారణం.




0 comments:

Post a Comment